భైరవం నా కెరీర్ మోస్ట్ మెమరబుల్ మూవీ – బెల్లంకొండ సాయి శ్రీనివాస్

దాసరిగారు ఎందరో ప్రతిభావంతులను ప్రోత్సహించారు – కె. మెహన్
మే 4న దర్శకరత్న డా. దాసరి నారాయణరావు జయంతిని తెలుగు చిత్ర పరిశ్రమ ‘డైరెక్టర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్స్ అసోసియేషన్, రెయిన్బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ సంయుక్తంగా టాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ని ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో పలు షార్ట్ ఫిల్మ్స్, ఫ్యూచర్ ఫిల్మ్స్ పోటీలో పాల్గొనగా, 15 షార్ట్ ఫిల్మ్స్, 3 ప్యూచర్ ఫిల్మ్స్, 1 మినీ మూవీ వివిధ విభాగాల్లో అవార్డులకు ఎంపికయ్యాయి.

ఈ ఫిల్మ్ ఫెస్టివల్కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకులు ముప్పలనేని శివ, వి. సముద్ర, నిర్మాతలు నాగులపల్లి పద్మిని, వి. మురళీధర్, రిటైర్డ్ తహసీల్దార్ బిక్కవల్లి సత్యానందం, రిటైర్డ్ జడ్జి మలయాద్రి, నటులు లోహిత్ కుమార్ అవార్డుగ్రహీతలకు మెమొంటోలు అందజేశారు.
ఈ సందర్బంగా టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. మెహన్ మాట్లాడుతూ – ‘‘దాసరిగారు ఎందరో ప్రతిభావంతులను ప్రోత్సహించారు. ఆయన జయంతి సందర్భంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న కొత్త తరాన్ని ఎంకరేజ్ చేనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ ఉత్సాహంగా పాల్గొని, వారి ప్రతిభను చాటుకున్నారు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం’’ అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి నివేదిత యాంకర్గా వ్యవహరించారు.