
రాజబాబు స్మృతికి పురస్కారాలతో నివాళి
బొడ్డు రాజబాబు రంగస్థలం , టీవీ , సినిమా రంగంలో సుప్రసిద్ధ కళాకారుడు . ఆయన తో ఒకసారి పరిచయం ఏర్పడితే అది జీవితాంతం మర్చిపోలేం , ఆయన స్మృతికి నివాళిగా మిత్ర బృందం పురస్కారాల కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ చెప్పారు .
బొడ్డు రాజబాబు 68వ జయంతి , స్మారక పురస్కారాల కార్యక్రమం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో శుక్రవారం జరిగింది .
ముఖ్య అతిధిగా వచ్చిన గోపాల కృష్ణ మాట్లాడుతూ … రాజబాబు పేరుతో వివిధ రంగాల్లో నిష్టాతులైన వారిని సత్కరించి పురస్కారాలు అందజేయడం ఎంతో సముచితంగా ఉందని , రాజబాబు మా అందరికీ ఎంతో స్నేహపాత్రుడని అన్నారు .
ఈ కార్యక్రంలో పురస్కారాలు అందుకున్న డి .ఎస్. ఎన్ మూర్తి గారు మా గురువుగారు , భగీరథ గారు ఆత్మీయ మిత్రుడు ఉగాది రోజు ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారు భగీరథ గారికి కళారత్న అవార్డు బహుకరించారు . మేమిద్దరం ఎన్ .టి .ఆర్ . సెంటినరీ కమిటీలో సభ్యులం అని చెప్పారు .
భగీరథ గారు శ్రీకృష్ణదేవరాయల ప్రేమ కథను ‘నాగలాదేవి’ పేరుతో ఒక అద్భుతమైన పుస్తకం వ్రాశారు . ఆ పుస్తకాన్ని ఆందరూ చదివితీరాలి అని గోపాలకృష్ణ చెప్పారు .
సీనియర్ నిర్మాత కె .ఎస్ . రామారావు మాట్లాడుతూ .. ప్రభుత్వాలే ప్రతి సంవత్సరం అవార్డులను ప్రదానం చేయలేకపోతున్నాయి . అలాంటిది రాజబాబు పేరుతో ప్రతి సంవత్సరం అవార్డులను అందిస్తున్నందుకు మిత్ర బృందాన్ని అభినందిస్తున్నా. వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమంలో మరింత మంది సినిమావారు పాల్గొనేలా చూడాలని కోరారు
దర్శకుడు వీర శంకర్ మాట్లాడుతూ .. రాజబాబు చనిపోయినా ఇంకా ఆయన మిత్ర బృందం మనస్సులో పదిలంగా వున్నదని , రాజబాబు జన్మదినం అయినా జూన్ 13న పురస్కారాలు ప్రదానం చేసి ఒక వేడుకలా జరపడం , అదులో నన్ను భాగస్వామిని చేయడం సంతోషంగా ఉందని చెప్పారు .
సీనియర్ జర్నలిస్ట్ భగీరథ మాట్లాడుతూ .. రాజబాబు మా అందరికీ అంత్యంత ఆప్త మిత్రుడు , నాకు కళారత్న అవార్డు వచ్చిన సందర్భగా సత్కరిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు . నాకోసం గుమ్మడి గోపాలకృష్ణ గారు విజయవాడ నుంచి రావడం నాకెంతో ఆనదాన్నిచ్చిందని,,సభలో పాల్గొన్న అతిధులందరికీ భగీరథ ధన్యవాదాలు తెలిపారు .
నిర్వాహకులలో ఒకరైన కాకాని బ్రహ్మం మాట్లాడుతూ .. రాజబాబుకు మిత్రులంటే ప్రాణం , షూటింగ్ లేకపోతే ఆయన మిత్రులతోనే ఎక్కువ గడిపేవాడు. ఆయన పేరుతో ఇచ్చే ఈ పురస్కారాలకు ఆయన కుమారులు రమేష్ , వీరన్న చౌదరిల తోడ్పాటు వుంది . ఈ సంవత్సరం తొమ్మిది మంది ప్రతిభావంతులకు పురస్కారాలను అందిస్తున్నామని చెప్పారు .
జ్యోతి పూర్ణిమ మాట్లాడుతూ .. రాజబాబు గారితో అభిషేకం , రాధా -మధు, మనసు -మమత సీరియల్స్ లో నటించాను . అందరినీ అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు , ఆయన స్మృతులు ఎప్పుడూ మనతోనే ఉంటాయని చెప్పారు .
ఈ కార్యక్రంలో దర్శకుడు బి .గోపాల్ , తుమ్మల రంగారావు , నిర్మాత డీవీకే రాజు , దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు, ఆర్. నాగేశ్వరరావు , నర్రా వెంకట్ రావు,వి .కుమార్ ,వై .బాలాజీ , సూర్యతేజ , శైలజ ,గోరంట్ల సురేష్ ,అట్లూరి నాగేశ్వర రావు, క్రొత్తపల్లి శ్రీధర్ ప్రసాద్ , కొండపనేని ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు .
పురస్కారాలను దర్శకుడు వీర శంకర్, ఆచార్య డి .ఎస్. .ఎన్ .మూర్తి, కళారత్న భగీరథ , నటుడు జి .ఎస్ ,హరి ,పరిశోధకుడు జి జి .బసవ శంకర్ రావు , పాటల రచయిత వెనిగెళ్ల రాంబాబు ,విద్యావేత్త పూర్ణచంద్ర రావు ,నటి జ్యోతి పూర్ణిమ స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో సినీజోష్ పర్వతనేని రాంబాబు జన్మదినోత్సవాన్ని ఘనంగా జరిపారు.