
Yuvina Parthavi as Sampoorna in Aadarsha Kutumbam House No: 47
After the terrific response to Venkatesh as Chittibabu and Srinidhi Shetty as Swarna, the makers of Aadarsha Kutumbam House No: 47 – AK47 have now introduced the next member of the family. Yuvina Parthavi steps into the role of Sampoorna, the adorable daughter, whose playful antics seem to bring plenty of fun and trouble into Chittibabu’s life.
With the character introduction campaign continuing to build excitement, the makers will next unveil Raja Prajwal as Sarwa. Written and directed by Trivikram Srinivas and produced by S. Radha Krishna (Chinababu) under Haarika & Hassine Creations, the film features music by S. Thaman, cinematography by Ravi K. Chandran, and editing by Sreekar Prasad. Aadarsha Kutumbam House No: 47 – AK47 is all set for a grand worldwide theatrical release on October 2, 2026.
ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK47’ నుంచి మరో పాత్ర పరిచయం… ‘సంపూర్ణ’గా యువినా పార్థవి
విక్టరీ వెంకటేష్ ‘చిట్టిబాబు’గా, శ్రీనిధి శెట్టి ‘స్వర్ణ’గా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందిన తర్వాత, ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK47’ చిత్ర బృందం కుటుంబంలోని మరో సభ్యురాలిని పరిచయం చేసింది.
ఈ చిత్రంలో చిట్టిబాబు, స్వర్ణ దంపతుల ముద్దుల కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రలో బాలనటి యువినా పార్థవి నటిస్తోంది. అమాయకత్వం, చిలిపితనం, అల్లరితో నిండిన సంపూర్ణ పాత్ర చిట్టిబాబు జీవితంలో నవ్వులు పూయించడంతో పాటు, అనూహ్యమైన చిన్న చిన్న సంఘటనలకు కూడా కారణమవుతుంది. ఈ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉండనుందని చిత్ర బృందం తెలిపింది.
పాత్రల పరిచయాలతో సినిమాపై రోజురోజుకూ ఆసక్తిని పెంచుతున్న మేకర్స్, తదుపరి ‘సర్వ’ పాత్రలో నటిస్తున్న రాజా ప్రజ్వల్ను పరిచయం చేయనున్నారు.
రచన,దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి. కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK47’ చిత్రం 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది.
